ముంబై: సామ్నా పత్రికకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏక్నాథ్ షిండే తనను మోసం చేశారని, లేవలేని స్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు తన ప్రభుత్వంపై కుట్ర పన్నారని ఉద్ధవ్ ఆరోపించారు. తన శరీరం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ల కదలికలు హెచ్చు స్థాయిలో సాగినట్లు విమర్శించారు. షిండే వ్యవహరించిన తీరును ఖండిస్తూ.. ఒకవేళ తానే ఏక్నాథ్ను సీఎంగా చేసినా.. అతని రాక్షసత్వం అలాగే ఉండేదన్నారు. షిండేను నమ్మడం తాను చేసిన పెద్ద తప్పు అని ఉద్ధవ్ అన్నారు. తన తండ్రి పేరిట షిండే వర్గం ఎన్నికల్లో ఓట్లు అడగరాదన్నారు. ఎండిన ఆకులు చెట్టు నుంచి రాలిపడుతాయని, చెట్టు నుంచి అన్ని పొందిన అవి ఇప్పుడు ఆ చెట్టును వీడుతున్నట్లు షిండే వర్గంపై ఉద్దవ్ ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్రను వెన్నుపోటు పొడిచిందన్నారు.