ఆదిలాబాద్లో సోమవారం పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ మద్దతు ధర రూ.6,025 ఉండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.7,970 ధర వెచ్చించి కొనుగోలు చేశారు. రికార్డు స్థాయి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రూ.7,900 ధర పలికింది.
– ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి