ముంబై: ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం రేగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్కు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. గతేడాది కరోనా కేసులు వెలుగు చూపడంతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. ఈ సారి అలాంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో నిర్వాహకులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఫర్హత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ అధికారికంగా ఈ సీజన్కు దూరమయ్యాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న దీపక్ తాజా సీజన్లో బరిలోకి దిగడని శుక్రవారం ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. గాయంతో ఇబ్బంది పడుతున్న కోల్కతా పేసర్ రసిఖ్ సలామ్ స్థానంలో ఆ జట్టు హర్షిత్ రాణాను రిప్లేస్మెంట్ కింద జట్టులోకి తీసుకుంది. ఢిల్లీకి చెందిన హర్షిత్ను నైట్ రైడర్స్ ప్రాథమిక ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.