జూబ్లీహిల్స్, ఫిబ్రవరి7: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జ్వర సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారికి కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. పీహెచ్సీలలో, బస్తీ దవాఖానల్లో పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి కిట్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూసుఫ్గూడ, రహ్మత్నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్లలో ఆశవర్కర్లు, జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలతో కలిసి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం 4,854 మందికి సర్వే చేసి లక్షణాలున్న 189 మందికి కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. యూసుఫ్గూడ సర్కిల్లో డీఎంసీ రమేశ్ ఆధ్వర్యంలో ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ సర్వేను పరిశీలించారు.