గ్లాస్కో : వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి 26వ ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (COP-26)లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున యూకేలోని గ్లాస్కో చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ప్రధాని ఉండనున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో భేటీకానున్నారు. ప్రధాని విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్కు చోరుకోగా.. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఓ చిన్నారితో ప్రధాని ముచ్చటించారు. ఇదిలా ఉండగా.. గ్లాస్కోలో ఆదివారం రెండు రోజుల పాటు జరిగే ఇంటెన్సివ్ కాన్ఫరెన్స్ ప్రారంభం కాగా.. నవంబర్ 12 వరకు కొనసాగుతుంది. ఈ సమావేశంలో క్లైమెట్ జస్టిస్ సమస్య అంశంపై భారత్ లేవనెత్తే అవకాశం ఉంది. బ్రిటన్ అధ్యక్షతన ఈ సమ్మిట్ జరుగుతోంది. కాప్-26 సమావేశంలో 120 కంటే ఎక్కువ దేశాల నాయకులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పులకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.