జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 12 (నమస్తేతెలంగాణ)/ములుగు టౌన్/జనగామ చౌరస్తా: ఈవీఎంల భద్రతకు గోదాములను నిర్మించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్గోయల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 22 గోడౌన్ల నిర్మాణాలు చేపట్టగా, 20 పూర్తయ్యాయని, నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఈనెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లా కేంద్రాల్లో నిర్మించిన ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచే గోడౌన్లను ఆదివారం కలెక్టర్లు భవేష్మిశ్రా, కృష్ణ ఆదిత్య, శివలింగయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీవీ ప్యాట్ను పోలిన కేక్ను కట్ చేశారు. అనంతరం ములుగు కలెక్టరేట్ ఆడిటోరియంలో తాసిల్దార్లు, బీఎల్వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్వోలు గరుడ యాప్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన అన్ని ఫారాలను ఆన్లైన్లో పొందుపరచాలని ఆయన సూచించారు.