మహబూబాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రకృతి కూడా భయపడుతున్నదని, అందుకే వర్షాలు పడక కరువుఛాయలు అలుముకుంటున్నాయని మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. మహబూబాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
అధికారం లేకున్నా బీఆర్ఎస్ నాయకులు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్నారని చెప్పారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై డోర్నకల్, మహబుబాబాద్ నియోజకవర్గాల బీఎల్ఏలు, ఇన్చార్జులు, సమన్వయకర్తలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానుకోటకు వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.