Bakka Judson | హైదరాబాద్ : తెలంగాణలో కొనసాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని జడ్సన్ మీడియాకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ 4 లక్షల సిమ్ల కొనుగోళ్ల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారు. సీపీ ఆఫీసుకు వెళ్లి 4 లక్షల సిమ్ల వ్యవహారం బయటపెట్టిన తర్వాత మాకే చుట్టుకునే అవకాశం ఉందని అలెర్ట్ అయ్యారు. తమకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని చెప్పి పార్టీకి 34 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన కాంగ్రెస్ దళిత నాయకుడైన తనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని జడ్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తానేం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాహుల్కు మోదీ శత్రువు. మన బ్యాంకు ఖాతాలన్నీ మోదీ సీజ్ చేశారు. అలాంటి మోదీని పట్టుకుని బడా భాయ్ అని అన్నది రేవంత్ రెడ్డినే కదా..? అది కదా యాంటీ అంటే..? వీటన్నింటికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆత్మగౌరవం వదిలేసి బతకాలంటే తాను బతకలేను అని జడ్సన్ స్పష్టం చేశారు.
BIG BREAKING…
ఫోన్ టాపింగ్ 4 లక్షల సిమ్ముల కొనుగోళ్ల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి OSD చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని ఆరోపించిన AICC మాజీ సభ్యుడు, మాజీ AICC ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్⚫️ పార్టీకి 34 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన సీనియర్ కాంగ్రెస్ దళిత… pic.twitter.com/PVqmUmDdto
— Jagan Patimeedi (@JAGANBRS) March 28, 2024