న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారత జట్టుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ కొత్త చరిత్ర లిఖించిన భారత మహిళల జట్టును బుధవారం లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న ప్రపంచ చాంపియన్షిప్లో పతకంతో సత్తాచాటాలని ఆయన సూచించారు. అంతకుముందు జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ)అధ్యక్షుడు జగన్మోహన్రావు నేతృత్వంలో మహిళల జట్టును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్పాండే తదితరులు పాల్గొన్నారు.