హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చాంపియన్గా నిలిచిన హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ)కి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం గోవాలో ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో హెచ్ఎఫ్సీ 3-1 (పెనాల్టీ షూటౌట్)లో కేరళ బ్లాస్టర్స్పై అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘ఐఎస్ఎల్ విజేతగా నిలిచిన హెచ్ఎఫ్సీకి అభినందనలు. విజయానికి మీరు సరైన అర్హులు, సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది’ అని ట్వీట్ చేశారు.