ఒకరికి డబ్బే సర్వస్వం..మరొకరికి అనుబంధాలంటే ప్రాణం…భిన్న ధృవాల్లాంటి ఇద్దరు వ్యక్తుల జీవన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ‘ఖిలాడి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అన్నారు రమేష్వర్మ. ఆయన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. కోనేరు సత్యనారాయణ నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. సోమవారం నుంచి హైదరాబాద్లో రవితేజ, మీనాక్షిచౌదరిలపై ఓ పాటను చిత్రీకరించబోతున్నారు. భారీ సెట్లో తెరకకెక్కించబోతున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చుతున్నారు. డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, ఫిబ్రవరి 11న విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సాగర్, నిర్మాణ సంస్థలు: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్, నిర్మాత: సత్యనారాయణ కోనేరు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రమేష్వర్మ.