బౌద్ధనగర్, జనవరి22: మెట్టుగూడలో శనివారం రోడ్డు ప్ర మాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉ ప్పల్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న కాంక్రీట్ రెడిమిక్స్ వా హనం మెట్టుగూడ చౌరస్తా సమీపంలోకి రాగానే అదుపు తప్పి మెట్రో పిల్లర్ (1114)ను ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో ప్రమాదం త ప్పింది. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ను సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.