హైదరాబాద్ : పోటీ పరీక్షలకు కోసం విద్యార్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలకు అందజేయనున్నట్లు ఆడిట్ శాఖ డైరెక్టర్ మార్తినేని వెంకటేశ్వర్రావు తెలిపారు. తన తండ్రి, స్వాతంత్ర్య సమర యోధుడు పట్టాభి రామారావు జ్ఞాపకార్థం స్టడీ మెటీరియల్ను రూపొందించారు. ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరిలో ఆడిట్ డైరెక్టర్ శనివారం వాటిని ఆవిష్కరించారు. అనంతరం వాటిని సెంట్రల్ లైబ్రరీ అధికారులకు అందించారు. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాల గ్రంథాలయాలకు ఆడిట్ శాఖ ఉద్యోగులతో ఈ పుస్తకాలను పంపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు నూతనకంటి వెంకట్, రేవతి, ఆడిట్ అధికారులు వెంకటేశం, జయశ్రీ , ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ అధికారులు పాల్గొన్నారు.