హైదరాబాద్ (సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి), ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మూడో దశ తీవ్రత తగ్గడంతో ఇప్పటికే సాధారణ జన జీవనం నెలకొనగా… కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు (రిటర్న్ టు ఆఫీస్) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం 40% మంది ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు హైదరాబాద్ వెలుపల ఉండి వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నిర్వహించిన తాజా సర్వేలో అత్యధిక కంపెనీలు రిటర్న్ టు ఆఫీసు పని విధానానికి సుముఖంగా ఉన్నట్టు వెల్లడైంది. వివరాలివి..