న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జూన్ 6వ తేదీన ఇండియా రానున్నాడు. ఎంట్రెన్స్ పరీక్షల ఫలితాల అంశంలో నైతిక బాధ్యత తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిర్వహించే శాంతియుత ప్రదర్శనలో ఆయన పాల్గొననున్నాడు. ఇన్స్టాగ్రామ్లో దీప్కే ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఢిల్లీలో జరిగే ఆ నిరసన కార్యక్రమంలో మద్దతుదారులు, విద్యార్థులు పాల్గొవాలని పిలుపు ఇచ్చారు. అందరం దగ్గరకు రావాల్సిన సమయం ఆసన్నమైందని, భారత రాజ్యాంగం అడుగుజాడల్లో.. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ కోరుదామన్నాడు. మనం మన గళం విప్పితే, దానికి వాళ్లు తప్పకుండా వింటారన్నారు.
జూన్ 6వ తేదీన తన మద్దతుదారులందరూ విమానాశ్రయానికి చేరుకోవాలని తన వీడియో మెసేజ్లో పిలుపునిచ్చారు. జూన్ 6, శనివారం ఉదయం నేను ఢిల్లీకి చేరుకుంటానని, అందరూ విమానాశ్రయానికి రావాలని, కలిసికట్టుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్కు వెళ్దామని దీప్కే అన్నాడు. జంతర్ మంతర్లో శాంతియుత ప్రదర్శన కోసం పర్మిషన్ అడుగుదామన్నాడు. నీటి, సీబీఎస్ఈ లాంటి పరీక్షల సంబంధిత వివాదాల వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం దీనిపై బాధ్యత తీసుకోవాలని దీప్కే అన్నారు. సోషల్ మీడియా ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ పార్టీని సబ్స్క్రైబ్ చేస్తున్న వారి సంఖ్య కూడా కోట్లకు చేరుకున్నది.