న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke) ఇవాళ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ పోలీసులు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ధర్నా క్షేత్రం నుంచి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ తరలింపు ప్రక్రియ ముగిసిన తర్వాత.. వాంగ్చుక్ నిరాహార దీక్షకు కూర్చున్న ప్రదేశంలో అభిజీత్ దీప్కే ఆందోళనకు దిగారు. అయితే జూలై 20వ తేదీన జరగాల్సిన తమ ర్యాలీ యధావిధిగా జరుగుతుందని అన్నారు. జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి ప్రజలు రావాలని ఆయన వేడుకున్నారు. ప్రభుత్వం తీవ్రమైన తప్పు చేసిందని, ప్రతి ఒక్కరూ జంతర్ మంతర్ చేరుకోవాలని తెలిపారు. సీపీఐ ఎంఎల్కు చెందిన నేహా, అమీన్, మనీశ్ జంతర్ మంతర్ వద్ద 21వ రోజు కూడా దీక్ష చేపట్టనున్నట్లు ఏఐఎస్ఏ ప్రెసిడెంట్ ఎన్ సాయి బాలాజీ తెలిపారు.
#WATCH | Delhi: Founding President of the Cockroach Janta Party, Abhijeet Dipke, says, “I am commencing my indefinite hunger strike starting today. I appeal to everyone: do not back down; this movement will only grow larger. They have made a grave mistake… I urge everyone to… pic.twitter.com/iCoB6jSOHQ
— ANI (@ANI) July 18, 2026