హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎంఎస్టీఈ (చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్) పథకం విజయవంతంగా అమలవుతున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 300 మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆమె 43 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.7.81 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు.