అమరావతి : భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎన్వీరమణ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీజేఐ రాక సందర్భంగా అధికారులు, పోలీసు యంత్రాంగం గట్టి భద్రత ఏర్పాట్లను చేసింది. సీజేఐ ఈ రోజు, రేపు(ఆదివారం) విజయవాడలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.