ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం: టీశాట్ సీఈవో శైలేశ్రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం పలువురు సివిల్స్ ర్యాంకర్లతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీశాట్ సీఈవో ఆర్ శైలేశ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్ 20వ ర్యాంకర్ పీ శ్రీజ, 398 ర్యాంకర్ అంకిత మహావీర్తో సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్ తదితర పోటీ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ర్యాంకర్ల అనుభవాలను అందజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం టీశాట్ నెట్వర్క్ చానళ్లతోపాటు యూట్యూబ్, వెబ్సైట్, సోషల్మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్లో అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.