ఎర్రగడ్డ, డిసెంబర్ 1: క్రిస్మస్ వేడుకల సన్నాహక సమావేశాన్ని మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం బోరబండ తుర్రెబాజ్ఖాన్ కమ్యూనిటీహాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతాలకు అతీతంగా అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ఎమ్మెల్యే గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈనెల 11న యూసుఫ్గూడలో నిర్వహించే సెమీక్రిస్మస్ సంబురాలకు డివిజన్ నుంచి పాస్టర్లు, మత పెద్దలు హాజరు కావాలని సూచించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. సమావేశంలో కృష్ణమోహన్, ఎం.ఆనంద్కుమార్, ఎన్.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.