యువ కథానాయకుడు కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి లోహితరెడ్డిని ఆయన పెళ్లాడారు. వీరి వివాహం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు అగ్రకథానాయకుడు చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు పెళ్లికి హాజరయ్యారు. కార్తికేయ, లోహితరెడ్డి ఇద్దరూ బాల్యమిత్రులు. వరంగల్లో వీరిద్దరు కలిసి ఇంజినీరింగ్ చదువుకున్నారు.