న్యూఢిల్లీ, అక్టోబర్ 30: వీగర్ ముస్లింలపై చైనా దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీగర్లను డిటెన్షన్ క్యాంపుల్లో బంధించిన డ్రాగన్.. వారి అవయవాలను బలవంతంగా సేకరించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొంటున్నది. ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన హెరాల్డ్ సన్ వార్తా సంస్థ ఓ నివేదికను ప్రచురించింది. ఓ వీగర్కు చెందిన కాలేయాన్ని బ్లాక్ మార్కెట్లో రూ.45లక్షలకు అమ్మకానికి పెట్టినట్టు ఆ నివేదిక పేర్కొన్నది. వీగర్ల అవయవాల అమ్మకంపై వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. దీనిపై గతంలో ఐరాస మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.