బీజింగ్: వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ ఫుట్బాల్ ఫైనల్స్ టోర్నీని నిర్వహించేందుకు చైనా వెనుకడుగు వేసింది. ఆసియా కప్ ఫైనల్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ దేశం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆసియన్ ఫుట్బాల్ సంఘం శనివారం వెల్లడించింది. నాలుగేళ్లకు ఓ సారి ఈ టోర్నీ నిర్వహిస్తారు. ఆసియా ఖండంలోని 24 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయి. 2023 జూన్ 16 నుంచి జూలై 16వ తేదీ వరకు చైనాలో జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ వల్ల ఆ టోర్నీ నిర్వహించలేమని చైనా తెలిపింది. అయితే ఎక్కడ ఆ టోర్నీ నిర్వహించాలన్న దానిపై మరో ప్రకటన ఉంటుందని ఏఎఫ్సీ వెల్లడించింది.