సిరికొండ : మండలంలోని పందిమడుగు గ్రామంలో బాల్య వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. 18 ఏండ్లు నిండకుండానే పెండ్లి జరిపిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీహరి, ఐసీడీఎస్ అధికారులతో వెళ్లి వివాహం జరుపరాదని అడ్డుకున్నారు. కాగా తల్లి దండ్రులతోపాటు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
బాలిక 16సంవత్సరాలు మాత్రమే ఉందని అధికారుల విచారణలో తేలింది. 18 ఏండ్లు నిండనిదే పెండ్లి చేయొద్దని సూచించారు. బాల్య వివాహాలు చట్టారీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని, మండల చైల్డ్ ప్రొటక్షన్ అధికారి సరిత, సర్పంచ్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.