బోడుప్పల్, ఫిబ్రవరి17: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని 1080 ఎకరాల చెంగిచెర్ల అర్బన్ ఫారెస్ట్ను సినీ నటుడు నాగార్జున దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఎంపీ సంతోష్కుమార్తో కలిసి గురువారం పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ స్పెషల్ సెక్రటరీ శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, పీసీసీఎఫ్(ఎస్.ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్, సీపీ మహేశ్ భగవత్, హీరో నాగార్జున కుటుంబసభ్యులు అమల, నాగచైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్, సుప్రియ, సురేంద్ర, సుమంత్కుమార్, నాగసుశీల, మేయర్ జక్క వెంకట్రెడ్డి, బోడుప్పల్ డిప్యూటీ మేయర్లు కొత్త లక్ష్మీరవిగౌడ్, ఫీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు చందర్గౌడ్, నాయకులు రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదిన కానుకగా బోడుప్పల్ కార్పొరేషన్ 2వ డివిజన్లోని చెంగిచర్ల అర్బన్ ఫారెస్ట్ను హీరో నాగార్జున దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంపై బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హరితహారంలో బోడుప్పల్ పరిధిలో రెండేండ్లలో రూ.8.80కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో బోడుప్పల్ను హరితవనంలా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.