హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): పరిస్థితులకు అనుగుణంగా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు సిలబస్ మార్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చర్యలు తీసుకున్నది. సిలబస్లో చేయాల్సిన మార్పులపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సూచనలు తీసుకున్నది. ఈ మేరకు సోమవారం వీసీ ప్రవీణ్రావుకు ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ శేషాద్రి నివేదిక అందించారు. మరోవైపు రైతునేస్తం అవార్డులు పొందిన వ్యవసాయ కాలేజీ విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ మధుబాబు, పీఆర్వో సుధాకర్ను వీసీ అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.