అమరావతి : టీడీపీ అధినేత , ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయ్యాకే తాను సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు అధికార, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. సభలో నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు.. నా కుటుంబ సభ్యులను అవమానపరిచేలా కించపరిచారు.
రెండున్నర సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు భరించా. ఏపీ శాసనసభలో తనపై అధికార పక్ష సభ్యులు అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న అవమానాలను భరించలేక తాను ఇకపై అసెంబ్లీలో అడుగుపెట్టనని, సీఎంగానే మరోసారి అడుగుపెడతానని .. సెలవంటూ సభకు నమస్కరించి .. టీడీపీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిపోయారు.