హైదరాబాద్ : తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తి ప్రధాత వీరనారి చాకలి ఐలమ్మ. భూస్వా ములను ఎదిరించి పంటను దక్కించుకున్న పోరాటయోధురాలు ఐలమ్మని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటం సాగించారన్నారు.
నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకకునెట్టేయబడ్డ బలహీనవర్గాలకు సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నారన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మనమంతా అండగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో మంత్రి తలసాని,బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య,బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఐలమ్మ జయంతి వేడుకల కమిటీ చైర్మన్ అక్క రాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.