సీఎం రేవంత్ అంగీకరించడం వల్లే బనకచర్ల ద్వారా 200 టీఎంసీల నీళ్లు ఏపీకి అనుమతిస్తూ కేంద్రం లేఖ పంపింది. ఆ లేఖ సంగతి మీకు తెల్వదా? అసలు మీ ప్రభుత్వం పనిచేస్తున్నదా? తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడైతే, కేంద్రం మీద యుద్ధం చేయాలె. బాబుకు గురుదక్షిణగా.. జలదోపిడీకి సహకరిస్తున్నారా? ఆంధ్రా అల్లుడు అయినంత మాత్రాన తెలంగాణ నీటివాటా అప్పగిస్తారా? రేవంత్ఉద్యమద్రోహి మాత్రమే కాదు, జలద్రోహి కూడా.
– హరీశ్రావు
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ద్రోహిగా మారిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఏపీకి గురుదక్షిణగా తెలంగాణ వాటా జలాలు అప్పగిస్తూ జలద్రోహిగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల మీటింగ్ జరిగిన 15 రోజులకే బనకచర్ల ద్వారా 200 టీఎంసీల నీళ్లు ఏపీ తరలించుకునేందుకు కేంద్ర జల్శక్తి శాఖ అనుమతి ఇచ్చిందని, ఆ మీటింగ్లో రేవంత్రెడ్డి అంగీకరించినందునే ఏపీకి అనుమతి వచ్చిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. జల హక్కుల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్ ఎంతకైనా సిద్ధమని, ఢిల్లీకి వెళ్లి సీడబ్ల్యూసీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం.. పదా అని రేవంత్రెడ్డికి చురకలంటించారు. ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ నిర్వహించిన ఏపీ, తెలంగాణ సీఎం సమావేశానికి పోను పోను అంటూనే రేవంత్ వెళ్లి సంతకం కూడా చేశారని, బనకచర్ల అంశమే ఎజెండాలో లేదని బుకాయించారని చెప్పారు. కానీ, ఏపీ జలమంత్రి గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై చర్చ జరిగిందని, టెక్నికల్ అంశాలు పరిష్కరించుకొనేందుకు కమిటీలు వేసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. అన్నట్టుగానే 15న ఏపీ కమిటీ వేయగా, ఈ నెల 23న తెలంగాణ సర్కార్ కూడా కమిటీ వేసిందని చెప్పారు. తెలంగాణ నీళ్లు తెలంగాణకు దకకుండా ఎట్లా చేయవచ్చో ఆంధ్రా ప్రభుత్వానికి నేర్పిన, చంద్రబాబుకు దాసుడైన ఆదిత్యానాథ్ దాస్ నేతృత్వంలోనే కమిటీ వేయడం దొంగకు తాళాలు ఇచ్చినట్టు కాదా?. అని ప్రశ్నించారు. ‘ఇదంతా రేవంత్రెడ్డి డ్రామా. కొట్టినట్టు ఉండాలె దెబ్బ తాకద్దు. ఆపినట్టు ఉండాలె ప్రాజెక్టు ఆగొద్దు. ఏపీ జలదోపిడీ సాగాలె, తెలంగాణ నిండా మునగాలె అని చూస్తున్నారు. తక్షణమే ఆ కమిటీని రద్దు చేయాలి’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవిగౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్తో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
బనకచర్ల ముప్పును ముందుగానే పసిగట్టి రణభేరి మోగించిందే బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్రావు గుర్తుచేశారు. తాను ముల్లుకర్ర కాదు బల్లెం పెట్టి పొడిస్తే గానీ ఈ ప్రభుత్వం మొద్దునిద్ర లేవలేదని, ఎన్నో ప్రెస్మీట్లు పెట్టి, ఎప్పటికప్పుడు హెచ్చరించినా కాంగ్రెస్ సర్కారు తగిన స్థాయిలో స్పందించలేదని విమర్శించారు. బనకచర్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఆధారాలతో ప్రజలకు వెల్లడిస్తే పాత డేట్లు వేసి తాము బనకచర్లను అడ్డుకునేందుకు లేఖలు రాసినట్టు పాత డేట్లతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి లేఖలు విడుదల చేశారని గుర్తుచేశారు. ఏపీ సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల లింకు ప్రాజెక్టును అడ్డుకునేందుకు తాము పోరాటం చేస్తున్న సమయంలో కేంద్ర జల్శక్తి శాఖ ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు మీటింగ్ ఏర్పాటుచేసిందని చెప్పారు. అపెక్స్ మీటింగ్కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరుకావొద్దని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఆనాడు గట్టిగా హెచ్చరించిందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి తీరుపై తాము నిలదీస్తే మీటింగ్ ఎజెండాలోనే బనకచర్ల లేదని, కనుక చర్చ జరిగే ప్రసక్తే లేదని రేవంత్రెడ్డి డైలాగులు దంచారని హరీశ్రావు విమర్శించారు. ఈ సందర్భంగా నాడు సీఎం వ్యాఖ్యలను మీడియాకు చూపించారు. సీఎంల సమావేశానంతరం ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అసలు బండారం బయట పెట్టారని చెప్పారు. బనకచర్లపై చర్చ జరిగిందని, ప్రాజెక్టులో విషయంలో టెక్నికల్ అంశాల పరిశీలనకు కమిటీలు వేయాలని నిర్ణయించినట్టు మీడియా ముఖంగా చెప్పారని పేర్కొన్నారు. నాడు బనకచర్లపై రామానాయుడు మాట్లాడిన వీడియోను మీడియాకు చూపించారు. బనకచర్లను బంద్ పెడుతున్నట్టు పేరుకు మాత్రమే ఏపీ ప్రకటించిందని, కానీ నల్లమలసాగర్ ప్రాజెక్టును ముందుకు తెచ్చిందని విమర్శించారు. అది కూడా తన ప్రతాపమే అన్నట్టుగా ఈ సీఎం, నీళ్ల మంత్రి డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీ తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింకుతో పోలిస్తే నల్లమల సాగర్లో రెండు విధాలుగా తెలంగాణ రాష్ర్టానికి నష్టమని హరీశ్రావు చెప్పారు. బనకచర్ల ద్వారా వెళ్తే కృష్ణాజలాల్లో తమకు నష్టం జరుగుతుందని భావించే ఏపీ నల్లమల సాగర్ను తెరమీదికి తెచ్చిందని తెలిపారు. ‘గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం.. 45:21:14 నిష్పత్తిలోగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ రూల్ వర్తిస్తుంది. ఈ విషయంపై కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖలు రాశాయి. గోదావరి నుంచి 80, 100, 243 మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకెళ్తే మేం 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకొంటాం. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం, గోదావరి నీళ్లు తరలిస్తే.. మరుసటి రోజు నుంచి మీద నీళ్లు ఆపుతం’ అని 2025 సెప్టెంబర్ 17న కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ‘అసలు ఫ్లడ్ వాటర్ మీద ముందుకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే మహారాష్ట్ర వాటా చెప్పండి. వరద జలాల మీద ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే, మేము కూడా ప్రాజెక్టులు కట్టుకునేందుకు డీపీఆర్లు పంపుతం. కృష్ణాలో 74 టీఎంసీలు మా వాటా నీళ్లు ఆపుకొంటం. వరద ప్రాజెక్టులు కడుతం. విదర్భకు నీళ్లు తీసుకుపోతం, అని మహారాష్ట్ర కూడా లేఖ రాసింది. కర్ణాటక 112 టీఎంసీలు, మహారాష్ట్ర 74 టీఎంసీలు ఆపుకొంటామని స్పష్టంచేశాయి. మరోవైపు తెలంగాణకు కూడా 45 నిష్పత్తిలో వాటా దకుతుంది. ఈ వాటా తెలంగాణ సహా ఏ రాష్ట్రానికీ దక్కకుండా చేసేందుకు కృష్ణాలో కలుపకుండానే గంపగుత్తగా పెన్నా బేసిన్కు గోదావరి నీటిని టన్నెల్ ద్వారా తరలించే పెద్ద కుట్రకు తెరతీసిండు చంద్రబాబు నాయుడు. ఇందుకు పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు చంద్రబాబు భారీ సెచ్ వేశాడు. ఈ ప్లాన్ కర్ణాటక, మహారాష్ట్రకు అర్థం అయ్యింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అర్థం కాలేదు’ అని విమర్శించారు.

ఢిల్లీ మీటింగ్కు పోనంటూనే ఆదిత్యానాథ్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సీఎం రేవంత్రెడ్డి కమిటీ వేశారని హరీశ్రావు విమర్శించారు. ఇందులో ముగ్గురు ఆంధ్రా మూలాలున్న వ్యక్తులకు చోటు కల్పించారని, ఇక తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుందని నిలదీశారు. ఆ కమిటీ లేఖను మీడియాకు చూపించారు. ఏపీ కమిటీ వేస్తే, తెలంగాణ కూడా కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వానికి పేర్లు కూడా పంపిందని మండిపడ్డారు. ఈ నెల 15న చంద్రబాబు కమిటీ వేస్తే, 23న రేవంతరెడ్డి కమిటీ వేసిశారని మండిపడ్డారు. అది కూడా చంద్రబాబుదాసుడైన ఆదిత్యానాథ్ దాస్ నేతృత్వంలో కమిటీవేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ కోవర్టు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ఉద్యమద్రోహి మాత్రమే కాదు, ఇప్పుడు జలద్రోహి కూడా అని మండిపడ్డారు. తక్షణమే ఆ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మీరే కేసు వేసి.. మళ్లీ మీరే కమిటీ వేసి ఏపీ జలదోపిడీకి రేవంత్రెడ్డి సర్కారు పరోక్షంగా సహకరిస్తున్నదని హరీశ్రావు ఆరోపించారు. ఏపీ సర్కారు ఈనెల 11న ప్రాజెక్టు పనులకు టెండర్ వేస్తే అది అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈనెల 16న సుప్రీంకోర్టుకు వెళ్లిందని విమర్శించారు. ప్రాజెక్టు టెండర్లు రద్దుచేయాలని ముందస్తుగా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. 16న కోర్టులో కేసు వేసిన ప్రభుత్వం ఈ కేసు నీరు కార్చేందుకు ఈ నెల 23న కమిటీ వేసిందని విమర్శించారు.
ఒక పక కేసు వేస్తారు, మరో పక కమిటీ వేసి కేసు వీగిపోయేందుకు మీరే మార్గం సృష్టిస్తారా? అని మండిపడ్డారు. నీళ్ల వివాద పరిషారానికి పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కమిటీలు వేసుకున్నందున మీరు పరిష్కరించుకోండని రేపు కోర్టు అనే అవకాశం ఉన్నదని అన్నారు. ఇలాంటప్పుడు ప్రభుత్వం వేసిన కేసులో బలం ఏముంటది? అని ప్రశ్నించారు. కేసు వేసినప్పుడు కోర్టులో తేల్చుకో? మళ్లీ మళ్లీ కమిటీ ఎందుకు? చర్చలెందుకు? అందులో ఆదిత్యానాథ్దాస్ ఎందుకు? అని నిలదీశారు. ఇదంతా రేవంత్రెడ్డి డ్రామా? కొట్టినట్టు ఉండాలె దెబ్బ తాకద్దు. ఆపినట్టు ఉండాలె ప్రాజెక్టు ఆగొద్దు. ఏపీ జలదోపిడీ సాగాలె, తెలంగాణ నిండా మునగాలె’ అని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏపీ సర్కారు గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టును నల్లమలసాగర్కు మార్చుకోవడం వల్ల తెలంగాణకు రెండు విధాలుగా నష్టం. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. కృష్ణాలో దక్కాల్సిన 45శాతం వాటా రాకుండా పోతుంది. గోదావరి జలాల్లో నష్టం వాటిల్లుతుంది. బనకచర్ల అయినా నల్లమలసాగర్ అయినా కొల్లగొట్టేది మాత్రం తెలంగాణ నీటి వాటానే. నల్లమలసాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే, పాత్రధారి రేవంత్రెడ్డి. కత్తి చంద్రబాబుది అయినా పొడిచేవాడు రేవంత్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర జల వాటాను కాపాడుతున్నారా? బాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారా?.
– హరీశ్రావు
గోదావరి బనకచర్లకు అత్యంత కీలకమైన అనుమతి జూలైలోనే వచ్చిందని, ఈ ప్రభుత్వానికి సోయి లేదు, మొద్దు నిద్ర నటిస్తున్నదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జూలైలో ఢిల్లీ మీటింగ్ అయిన 15 రోజులకే బనకచర్లకు అనుమతి వచ్చింది. ఆ మీటింగ్లో రేవంత్రెడ్డి అంగీకరించారు కాబట్టే పర్మిషన్ వచ్చింది. పోలవరం స్పిల్వే నుంచి చింతపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా జూలై నుంచి అక్టోబర్ వరకు 200 టీఎంసీల నీళ్లు మళ్లించుకోవచ్చని లేఖలో స్పష్టంచేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ డాక్యుమెంట్ కూడా లేదు. నేను విడుదల చేస్తున్నా’ అని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు అనుమతి లేఖను హరీశ్రావు మీడియాకు చూపించారు. ‘ధాన్యం కొనుగోలు చేయకపోతే మేమే ఢిల్లీలో ధర్నా చేశాం. 940 టీఎంసీల నీటి అనుమతులను కేసీఆర్ పోరాడి సాధించారు. సెక్షన్ 3 సాధించారు కేసీఆర్. నువ్వేమో ఆంధ్రాకు ఊడిగం చేస్తున్నవు. మన నీళ్లు వాళ్లకు అప్పగిస్తున్నవు. ఏపీ ముఖ్యమంత్రి చెప్పినట్లు చేస్తున్నవు. ఆంధ్రాదాసుడిగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నవు. తెలంగాణ ప్రజలకు రేవంత్రెడ్డి మరోసారి నగ్నంగా దొరికారు. ఐదు నెలల క్రితమే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏపీకి అనుమతి వస్తే నువ్వే చేస్తున్నవు. రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరు పారేసుకోవడం తప్ప చేసేదేం లేదు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడు. అసెంబ్లీలో చిల్లర ప్రసంగం కాదు.. గోదావరి నల్లమలసాగర్కు తెలంగాణ వ్యతిరేకమని తీర్మానం చెయ్యి. ఢిల్లీకి కదులు, సీడబ్ల్యూసీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పదా’ అని హరీశ్రావు హితవు పలికారు. నీళ్ల బాధ నీకేం తెలుసు రేవంత్రెడ్డి? జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఆంధ్రాకు, బాబుకు దాసోహం చేయడం కాదు రేవంత్రెడ్డి? అని చురకలంటించారు.
తెలంగాణ నీళ్లు తెలంగాణకు దకకుండా ఎట్లా చేయవచ్చో ఆంధ్రా ప్రభుత్వానికి నేర్పింది ఈ ఆదిత్యానాథ్దాస్ అని హరీశ్రావు మండిపడ్డారు. ‘తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ పక్షాన అత్యంత శ్రద్ధగా 100కు పైగా లేఖలు సంధించింది దాసే. రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ వేగంగా పూర్తి చేసేందుకు తోడ్పాడు అందించినది ఈ దాసే.
ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన చట్టానికి ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా పోలవరం విస్తరణ పనులు చేపట్టి, సామర్థ్యానికి మించి గోదావరి జలాలు తరలించే కుట్రలు చేసిందీ ఇతనే. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఇతనే. చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్రెడ్డి ఈ ఆదిత్యానాథ్ దాసును నీటి పారుదలశాఖ సలహాదారుడిగా నియమించుకున్నారనేది స్పష్టం. ఆదిత్యానాథ్దాస్ చంద్రబాబుకు దాసుడు అన్నదీ వాస్తవం. అసలు కమిటీనే వేయొద్దంటే, కమిటీ వేసినవు. ఇప్పుడు.. నీకు సలహాదారుడుగా ఉన్న ఆదిత్యానాథ్దాస్ను చైర్మన్ చేశావు? ఇది దొంగకు తాళం ఇచ్చినట్లే కదా? రేవంత్రెడ్డి..? అని ప్రశ్నించారు.
అడుగడుగునా తెలంగాణ ఆకాంక్షలకు, నీటి హకులకు అడ్డంపడ్డ సైంధవుడు ఆదిత్యానాథ్ దాస్. పోలవరం-బనకచర్ల, పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఇతనే. చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్రెడ్డి ఈ దాసును నీటి పారుదలశాఖ సలహాదారుడిగా నియమించుకున్నారనేది స్పష్టం. ఆదిత్యానాథ్ చంద్రబాబుకు దాసుడు అన్నదీ వాస్తవం. అసలు కమిటీనే వేయొద్దంటే, వేసినవు. ఇప్పుడు.. నీకు సలహాదారుగా ఉన్న దాస్ను చైర్మన్ చేశావు? ఇది దొంగకు తాళం ఇచ్చినట్టే కదా? వెంటనే కమిటీని రద్దు చేయాలి.
– హరీశ్రావు
తనకు తాను డబ్బా కొట్టుకోవడంలో రేవంత్రెడ్డి దిట్ట అని హరీశ్రావు విమర్శించారు. ఉద్యమకారుల మీద రైఫిల్ ఎకు పెట్టిన రేవంత్రెడ్డి తాను కూడా ఉద్యమకారున్నే అంటారని మండిపడ్డారు. ‘సోనియాగాంధీని బలిదేవత అని తిట్టి వీర కాంగ్రెస్వాదిని అంటడు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు నేనే ఇచ్చిన అంటడు. బనకచర్ల మీద జంగ్సైరన్ ఊది పోరాటానికి దిగింది మేం అయితే, ఆపింది తామని జబ్బలు చరుచుకున్నడు. అసలు ఏం జరిగింది… పేరుకు మాత్రమే వాళ్లు ప్రాజెక్టు ఆపుతున్నం అని ప్రకటించారు. ఆపలేదు. పోలవరం నుంచి బనకచర్లలో కలుపకుండా, పోలవరం నల్లమలసాగర్కు లింకు చేశారు’ అని స్పష్టంచేశారు.