కేంద్ర సంస్థల దుర్వినియోగం: శరద్ పవార్
ముంబై: సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను విపక్షాల గొంతు నొక్కేందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక తమ నేతల బంధువులను లక్ష్యంగా చేసుకుని మోదీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నదని విమర్శించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన సంబంధీకులపై ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులను ఆయన ప్రస్తావించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ కేంద్ర సంస్థల దర్యాప్తు కారణంగానే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.