న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యూహాత్మక (అత్యవసర) నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను విడుదల చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని మూడు భూగర్భ క్షేత్రాల్లో 3.8 కోట్ల బ్యారెళ్ల వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఇందులో నుంచి ముడి చమురును అత్యవసరంగా విడుదల చేయడం ఇదే మొదటిసారి. కాగా ఇంధన ధరల కట్టడికి అమెరికా, చైనా, జపాన్ తరహాలోనే భారత్ కూడా వ్యూహాత్మక నిల్వలను విడుదల చేస్తున్నది.