న్యూఢిల్లీ: భారతీయ ఆర్మీలోని 117 ఇంజినీర్ రెజిమెంట్కు చెందిన కెప్టెన్ సురభి జక్మోలాకు అరుదైన గౌరవం దక్కింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) అసైన్మెంట్లో భాగంగా ఆమెకు విదేశీ విధులను అప్పగించారు. ప్రాజెక్ట్ ధంటక్లో భాగంగా ఆమెను భూటాన్కు పంపనున్నారు. సైనిక దళాల్లో ఉన్న మహిళా ఆఫీసర్కు విదేశీ అసైన్మెంట్ను అప్పగించడం ఇదే మొదటిసారి. భారత దేశ సరిహద్దు మిత్రదేశాల్లో రోడ్ నెట్వర్క్ పనుల్ని బీఆర్వో చేపడుతుంది. బోర్డర్ కనెక్టివిటీని పెంచేందుకు ఆ శాఖను ఏకంగా రక్షణ మంత్రిత్వశాఖలో కలిపారు. కొన్ని రోజుల క్రితం భారత వైమానిక దళం ఫైటర్ పైలెట్ అవ్నీ చతుర్వేదిని జపాన్లో జరగనున్న యుద్ధ విన్యాసాలకు పంపిన విషయం తెలిసిందే.