న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్పై ప్రస్తుత దశలో అనుమానాలు వ్యక్తం చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది టీకా తీసుకున్నారని, డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కూడా ఉందని తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోకుంటే తలెత్తే పరిణామాలను భరించలేమన్నది. టీకా దుష్ప్రభావా చాలా మంది మరణించారని, దీన్ని స్వచ్ఛందం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఓ పిటిషన్ దాఖలైంది.