న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ లాభాల్లో దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్ లాభంలో రెండింతల వృద్ధి నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో రూ. 444.41 కోట్లుగా ఉన్న నికర లాభం గత త్రైమాసికానికిగాను రూ.1,332. 61 కోట్లకు ఎగబాకింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదా యం కూడా రూ.20,793.92 కోట్ల నుంచి రూ.21,331.49 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.23 శాతం(రూ.53,437. 92 కోట్లు) నుంచి 8.42 శాతానికి (రూ. 57, 853.08 కోట్లకు) చేరుకోగా, నికర ఎన్పీఏ మాత్రం 3.42 శాతం(రూ.21,063.28 కోట్ల) నుం చి 3.21 శాతానికి(రూ. 20,861.99 కోట్ల కు) తగ్గాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.3,360 కోట్ల నిధులను వెచ్చించింది. కన్సాలిడేటెడ్ ఆధారంగా రూ.23,876 కోట్ల ఆదాయంపై రూ. 1,100.59 కోట్ల లాభాన్ని గడించింది.