న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకాలు కైవసం చేసుకున్న భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్ టాప్-10లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ టోర్నీలో రజతం కైవసం చేసుకున్న శ్రీకాంత్ నాలుగు ర్యాంక్లు ఎగబాకి 10వ స్థానంలో నిలవగా.. కాంస్యం గెలుచుకున్న యువ షట్లర్ లక్ష్యసేన్ రెండు ర్యాంక్లు మెరుగుపర్చుకుని 17లో నిలిచాడు.
ఇక సాయి ప్రణీత్ రెండు ర్యాంకులు దిగజారి 18కి చేరగా.. హెచ్ఎస్ ప్రణయ్ ఆరు స్థానాలు మెరుగై 26వ ర్యాంకులో నిలిచాడు. మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఏడో ర్యాంక్లో సుస్థిరంగా కొనసాగుతుండగా.. సైనా నెహ్వాల్ మాత్రం 26లో నిలిచింది. పురుషుల డబుల్స్లో చిరాగ్ శెట్టి-సాత్విక్సాయిరాజ్ ద్వయం ఒక స్థానం దిగజారి పదో ర్యాంకుకు చేరగా.. మహిళల డబుల్స్లో ఒక స్థానం మెరుగై సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ 20వ ర్యాంకులో నిలిచింది.