హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో ప్రమాదవశాత్తు పెళ్లి బస్సు బోల్తా పడింది. కూసుమంచి మండలం సీతారాపురం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో 23 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారని సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.