Telangana | హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : తెలంగాణతో వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు బల్గేరియా ఆసక్తితో ఉన్నదని భారత్లో ఆ దేశ రాయబారి డా.నికోలాయ్ యాంకోవ్ వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మంత్రి అంగీకరించారు.
నూతన ఆవిషరణలు, ఫార్మా, లైఫ్సైన్సెస్లో తమ రాష్ట్రంలో అద్భుతమైన ఎకోసిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్ బాబు ఆయనకు వివరించారు. త్వరలో ఇరు దేశాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపాలని శ్రీధర్ బాబు చేసిన ప్రతిపాదనకు నికోలాయ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆ దేశపు గౌరవ కాన్సులేట్, సుచిర్ ఇండియా ఇన్ఫ్రా సీఈవో డా.కిరణ్ కుమార్ కూడా హాజరయ్యారు.