హనుమకొండ చౌరస్తా, మార్చి 23: హనుమకొండ జూనియర్ కాలేజీ జంక్షన్లో డెమోక్రటిక్ స్టూడెంట్స్అసోసియేషన్(డీఎస్ఏ) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకు తీవ్ర అన్యాయం చేశారని విద్యాశాఖ బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ మాట్లాడుతూ.. శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ర్ట బడ్జెట్లో విద్యారంగానికి కేవలం నామమాత్రపు కేటాయింపులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
కొఠారి కమిషన్ ఆధారంగా రాష్ర్ట బడ్జెట్లో కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని కమిషన్ తెలియజేసిందని, దాన్ని గాలికి వదిలేసిందన్నారు. సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక నామమాత్రపు నిధులను 26,674కోట్లు అనగా బడ్జెట్ లో 8.22శాతం నిధులను మాత్రమే కేటాయిస్తూ చేతులు దులుపుకుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజ్కుమార్, కమల్, వంశీ, సంపత్, రాజేష్, భానుప్రతాప్, లావణ్య, సృజన, రమ్య, అంజలి, అక్షిత, నాగేశ్వరీ, శివాని పాల్గొన్నారు.