హయత్నగర్ రూరల్, డిసెంబర్ 11: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. సిరిసిల్ల పట్టణంలోని ప్రగతినగర్కు చెందిన పులి ప్రణయ్కుమార్ (21) ఎల్బీనగర్ చింతలకుంటలో ఉంటూ విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం కాలేజీ నుంచి బైక్పై ఇంటికి బయలుదేరాడు. జాతీయ రహదారిపైకి రాగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ.. బైక్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ప్రణయ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. అదే వేగంతో కొద్దిదూరం దూసుకెళ్లిన లారీ ఆలయ ప్రహరీని ఢీకొట్టింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.