లక్నో: వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టంచేశారు. ఒంటరిగానే పోటీచేసి 2007 ఎన్నికల తరహాలో మళ్లీ తాము భారీ మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఎస్పీ, బీజేపీ దొందూ దొందేనని, ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల వంటివవన్నారు.