శివ్వంపేట, మే 13 : మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని ఓ వ్యక్తిని హత్య చేసి పడేయడంతో స్థానికంగా కలకలం రేగింది. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన పలువురు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్, స్థానిక ఎస్ఐ మధుకర్ రెడ్డి అక్కడికి చేరుకొని పరిశీలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన ఎండీ అన్వర్ (50) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హత్య చేసి శభాష్పల్లి గ్రామ శివారులో పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.