కరోనా వల్ల ఆగిపోయిన పెళ్లిళ్లన్నీ ఇప్పుడు పీటలెక్కాయి. ఎక్కడచూసినా పెళ్లి వేడుకలే కనిపిస్తున్నాయి. కొన్ని వేడుకల్లో సరదా, వింతసంఘటనలు జరుగుతున్నాయి. అవి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలో జరిగిన వరమాల వేడుకలో వధువు.. వరుడి చెంప వాయించి స్టేజి దిగి పారిపోయింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను జర్నలిస్ట్ పీయూష్ రాయ్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. వరమాల ఫంక్షన్కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. వరుడు..వధువు మెడలో మాల వేయబోతుండగా వధువు అడ్డుకుంది. అనంతరం అతడి చెంపపై రెండు దెబ్బలుకొట్టి స్టేజి దిగి పారిపోయింది. ఆమెకు ఈ పెళ్లి ఇష్టంలేకపోవడం వల్లే ఇలా చేసిందని వధువు తరఫు బంధువులు తెలిపారు.
వధువు రీనా, వరుడు రవికాంత్ అహిర్వార్గా గుర్తించారు. పోలీసుల రంగప్రవేశం చేసి ఇరువర్గాలతో మాట్లాడిన తర్వాత చివరికి వారి పెళ్లి సజావుగా జరిగింది. ఇదిలా ఉండగా, వీడియో నెట్టింట వైరల్గా మారింది. చాలామంది వధువు అలా చేయాల్సింది కాదని కామెంట్ చేయగా, ఆ వధువు బలవంతపు పెళ్లి చేస్తున్నందుకు తల్లిదండ్రులను కొట్టాల్సిందని మరొకరు అభిప్రాయపడ్డారు.
In UP’s Hamirpur, a video of a bride slapping the groom on stage during “jaimal” ceremony on Sunday has surfaced. Details on what triggered this outburst are still sketchy but a relative from groom’s side claims bride “didn’t like” the groom. pic.twitter.com/LjbSKmy0OD
— Piyush Rai (@Benarasiyaa) April 18, 2022
Local police intervened to contain the situation. Later, the wedding took place. pic.twitter.com/cOd3oUMAf0
— Piyush Rai (@Benarasiyaa) April 18, 2022