బ్రెసిలియా, డిసెంబర్ 4: కొవిడ్ వ్యాక్సిన్తో ఎయిడ్స్కు ముడిపెట్టిన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారోపై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అలెగ్జాండర్ మోరేస్ శుక్రవారం ప్రాసిక్యూటర్ను ఆదేశించారు. బోల్సొనారో అక్టోబర్ 24న మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి.. ఎయిడ్స్ బారిన పడే ముప్పు అధికంగా ఉన్నట్టు బ్రిటన్ ప్రభుత్వ నివేదికలో వెల్లడైందని చెప్పారు. సోషల్మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోను తొలగించాయి. బోల్సొనారో వ్యాఖ్యలను వైద్యులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు.