తిరుపతి, జూన్ 26: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు శనివారం స్వామివారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై దర్శనమిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాహనసేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి.పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం పై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, తన నామ సంకీర్తనలతో తరించాలని ప్రబోధిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం 8.30 నుంచి10.15 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం,చక్రస్నానం నిర్వహించారు.