యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ అలయమైన పాతగుట్ట నారసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం స్వామి వారు హనుమంత వాహన సేవలో శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామి వారి సేవను పాతగుట్ట ఆలయ తిరువీధుల్లో ఉరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్ గీత, ప్రధానార్చకులు మోహణాచార్యులు, ఆలయ అధికారులు భాస్కర్, రఘు పాల్గొన్నారు.