యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజైన సోమవారం. స్వామి వారి అలంకార సేవ అత్యంత నయనానందంగా సాగింది. యాదాద్రీశుడు వటపత్ర శాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు.
స్వామివారి అలంకారం బాలాలయంలో జరిగింది.
అనంతరం మేళాలు, నాదస్వర చప్పుళ్లు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ అంగరంగ వైభవంగా ఉరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు పాల్గొన్నారు.
వటపత్ర శాయి అలంకార సేవలో పాల్గొన్న గవర్నర్..
బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి వటపత్ర శాయి అలంకార సేవలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌదర రాజన్ పాల్గొన్నారు. స్వామి వారి పల్లకిని స్వయంగా మోస్తూ ప్రత్యేక సేవను చేసి తరించారు.