హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సర్వైవల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. మోనోఫోబియాతో బాధపడుతున్న వర్థ్ధమాన రచయిత కథతో ఆసక్తికరంగా సాగుతుంది. అతడి జీవితం ఏ విధంగా ప్రమాదంలో పడింది? ఆ సమస్యల వలయం నుంచి రచయిత ఎలా బయటపడ్డాడన్నది థ్రిల్లింగ్గా ఉంటుంది. గౌతమ్ పాత్ర వినూత్నంగా సాగుతుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ:మోహన్, ఎడిటర్: కె సంతోష్.