హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల హర్యానా వేదికగా జరిగిన జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. తాను బరిలోకి దిగిన 52కిలోల కేటగిరీలో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ స్వర్ణం సహా టోర్నీ బెస్ట్ బాక్సర్గా నిలిచిన నిఖత్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. డిసెంబర్లో టర్కీలో జరిగే ప్రపంచ బాక్సింగ్ టోర్నీలోనూ సత్తాచాటాలని ఆయన అభిలషించారు. ఈ కార్యక్రమంలో సాట్స్చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జరీన్ తండ్రి జమీల్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ టోర్నీలో అదరగొట్టిన జరీన్కు కాకినాడ సీపోర్ట్స్ చైర్మన్ కేవీ రావు రూ.5లక్షల నగదు ప్రోత్సాహకమివ్వగా,
చాముండేశ్వరీనాథ్ రూ.2 లక్షలు అందజేశారు.