నాగర్కర్నూల్ : బొలెరో వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే దిగడంతో ముప్పు తప్పింది.
వాహన యజమాని శివ కథనం ప్రకారం జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన శివ కుటుంబ సభ్యులు, మరో ముగ్గురితో కలసి బొలెరో వాహనంలో హైదరాబాద్కు వెళ్తున్నారు.
మండలంలోని మరికల్ సమీపంలోకి రాగానే ముందుభాగం నుంచి పొగలు రావడంతో వెంటనే వాహనాన్ని నిలిపి బానట్ తీయగానే మంటల కనిపించాయి. అందులో ఉన్న వారిని కిందికి దించగానే మంటలు ఎగిసిపడటంతో క్షణాల్లో వాహనం తగలబడిపోయింది.
కొంత సేపటికి గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మంటలను ఆర్పినా అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. మంటల్లో కాలిన వాహనం విలువ సుమారు రూ.6 లక్షల దాకా ఉంటుందని అక్కడున్నవారు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్