చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి వీవీ వినాయక్ క్లాప్నివ్వగా, పూరి జగన్నాథ్ కెమెరా స్విఛాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రమిది. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఉన్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లో చిరంజీవి మాస్ అండ్ రగ్డ్ లుక్లో శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఏ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమనే, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్లక్ష్మణ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల, సహనిర్మాత: జీకే మోహన్, స్క్రీన్ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ).